Tuesday, April 30, 2024
- Advertisement -

మహా సముద్రం నుంచి మరో నటుడి ఫస్ట్​లుక్​.. ఇది చాలా భయానకం

- Advertisement -

రామ్​గోపాల్​ వర్మ శిష్యుడు, ఆర్​ఎక్స్​ 100 ఫేమ్​ అజయ్​ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం మూవీకి సంబంధించిన మరో లుక్​ను విడుదల చేసింది చిత్ర యూనిట్​. ఈ సినిమాలో శర్వానంద్​, సిద్ధార్థ్​ హీరోలుగా నటిస్తున్నారు. ఇక జగపతిబాబు, రావురమేశ్​, కేజీఎఫ్​ ఫేమ్​ గరుడ రామ్‌ విలన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి సినిమాతోనే విభిన్న దర్శకుడిగా గుర్తింపు పొందిన అజయ్​ భూపతి.. రెండో మూవీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

మహా సముద్రం మూవీకి హీరోను ఎంపిక చేయడంలో చాలా జాప్యం జరిగింది. చాలా మందిని అనుకొని చివరకు శర్వానంద్​ను ఫైనల్​ చేశారు. శర్వానంద్​ సరసన అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వా – సిద్ధార్థ్ – అదితి – అనూ ఇమాన్యూయేల్ – జగపతిబాబు, రావు రమేశ్‌ ఫస్ట్ లుక్స్ కి మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న కేజీఎఫ్‌ ఫేమ్‌ గరుడ రామ్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. అయితే గరుఢరామ్​ ఎంతో భయంకరంగా కనిపిస్తున్నాడు. మహాసముద్రంలో అతడే ప్రధాన విలన్​ అని టాక్​.ఇక ఓ రాక్షసరాజుగా గరుడ రామ్​ నటించనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read

ఆచార్య విడుదలపై అంతా గందరగోళం..!

ఇంగ్లీష్​లో డబ్​ అయిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -