రామ్గోపాల్ వర్మ శిష్యుడు, ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రం మూవీకి సంబంధించిన మరో లుక్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. ఇక జగపతిబాబు, రావురమేశ్, కేజీఎఫ్ ఫేమ్ గరుడ రామ్ విలన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి సినిమాతోనే విభిన్న దర్శకుడిగా గుర్తింపు పొందిన అజయ్ భూపతి.. రెండో మూవీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.
మహా సముద్రం మూవీకి హీరోను ఎంపిక చేయడంలో చాలా జాప్యం జరిగింది. చాలా మందిని అనుకొని చివరకు శర్వానంద్ను ఫైనల్ చేశారు. శర్వానంద్ సరసన అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వా – సిద్ధార్థ్ – అదితి – అనూ ఇమాన్యూయేల్ – జగపతిబాబు, రావు రమేశ్ ఫస్ట్ లుక్స్ కి మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న కేజీఎఫ్ ఫేమ్ గరుడ రామ్ ఫస్ట్ లుక్ని విడుదల చేసింది చిత్ర బృందం. అయితే గరుఢరామ్ ఎంతో భయంకరంగా కనిపిస్తున్నాడు. మహాసముద్రంలో అతడే ప్రధాన విలన్ అని టాక్.ఇక ఓ రాక్షసరాజుగా గరుడ రామ్ నటించనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read