Saturday, April 20, 2024
- Advertisement -

MahaSamudram: రిలీజ్ కి రెడీగా ఉన్న మహాసముద్రం..!

- Advertisement -

తన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తోనే ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఆయన మొదటి సినిమా తర్వాత రెండో సినిమా చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఒక డిఫరెంట్ జోనర్ లో సినిమా తీస్తున్నాడు. ఇది మల్టీస్టారర్ మూవీ. ఇందులో యువ హీరోలు శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడిచినప్పటికీ పలు కారణాల వల్ల షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల కూడా ఈ సినిమా షూటింగ్ చాలా రోజులు ఆగి పోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ఇవాళ మేకర్స్ వెల్లడించారు. మహా సముద్రం మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్టు చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు మరో హీరోగా సిద్దార్థ్ నటిస్తున్నాడు. ఇప్పుడు వస్తున్న మల్టీ స్టారర్ సినిమాల్లో.. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ఇదీ ఒకటి. తెలుగులో ఒకప్పుడు ఒక ఊపు ఊపిన లవర్ బాయ్ సిద్ధార్థ్ చాలా ఏళ్ళ తర్వాత ఈ మూవీ ద్వారా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగులో వరుస పరాజయాలతో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పిన సిద్ధార్థ్ కు ఈ సినిమా అయినా విజయాన్ని అందిస్తుందోమో చూడాలి. కాగా ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక శర్వానంద్ కూడా శ్రీకారం సినిమా ప్లాప్ కావడంతో మహాసముద్రం సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.

Also Read

ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ‘సౌత్ ఇండస్ట్రీయే’..!

రజనీ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

బాప్ రే…వెయ్యి మందితో లైగర్ క్లైమాక్స్ సీన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -