Wednesday, May 1, 2024
- Advertisement -

భ‌ర‌త్ 25 వ సినిమా టైటిల్ ఫిక్స్‌…?

- Advertisement -

భ‌ర‌త్ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం సిద‍్ధమవుతున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడు. అయితే ఈసినిమా గురించి ఓవార్త సోషియ‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

మహేశ్ బాబు తన 25వ సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో దర్శకుడు వంశీ పైడిపల్లి బిజీగా వున్నాడు. మహేశ్ బాబు కెరియర్లో సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోవడంతో, వంశీ పైడిపల్లి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. మహేశ్ బాబు అభిమానులకి పూర్తిస్థాయిలో సంతృప్తిని కలిగించేలా ఆయన ఈ సినిమా కథను తీర్చిదిద్దాడని అంటున్నారు.

ఈ సినిమా కోసం ఆయన ‘రాజసం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఫిల్మ్ నగర్లో ఈ వార్త జోరుగా షికారు చేస్తోంది గానీ, ఇందులో వాస్తవమెంతో చూడాలి మరి. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే మంచి హైట్ కావడం వలన తెరపై ఈ జంట కనువిందు చేయడం ఖాయమనేది అభిమానుల మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -