రంగస్థలం’ బ్లాక్ బస్టర్ హిట్తో దర్శకుడు సుకుమార్ రేంజ్ రెట్టింపు అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైత్రి మూవీస్ బ్యానర్లో ఓ చిత్రాన్ని ఇటీవల అఫీషియల్గా అనౌన్స్ చేశారు సుకుమార్. గతంలో ‘1 నేనొక్కడినే’ అంటూ ప్రిన్స్తో ప్రయోగం చేసిన చేతులు కాల్చుకున్న సుక్కూ..ఈ సారి అలాంటి దానికి ఆస్కారం ఇవ్వకుండా పక్కా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారంట.
మరోవైపు సుకుమార్ మూవీకి ప్రీ ప్రొడక్షన్స్ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే సుక్కూ – ప్రిన్స్ మధ్య స్టోరీ డిస్కషన్లు పూర్తికాగా.. ఇందులో మహేష్ ఓ డిఫరెండ్ క్యారెక్టర్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మహేష్ దూకుడు, పోకిరి, ఆగడు వంటి చిత్రాల్లో పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. తాజాగా సుక్కూ మూవీలో సీఐడీ ఆఫీసర్గా కనిపించబోతున్నారని టాలీవుడ్లో చర్చ నడుస్తోంది.
రంగస్థలం’ చిత్రాన్ని పూర్తి గ్రామీణ నేపథ్యంలో పొలిటికల్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దిన సుక్కూ.. తన నెక్స్ట్ మూవీని డిఫరెంట్గా కంప్లీట్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ కథను రెడీ చేస్తున్నారట. ఈ మూవీలో మహేష్ సిన్సియర్ సీఐడీ ఆఫీసర్గా చూపించబోతున్నారట సుక్కు. ప్రస్తుతం ఈ క్యారెక్టర్కి సంబంధించి స్కిప్ట్ వర్క్ పూర్తి అవుతుండగా.. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పట్టలెక్కనుంది.