తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు గుణశేఖర్ ఓ క్రియేటీవ్ జీనియస్. గుణ శేఖర్ ఏళ్ళ పాటు శ్రమించి, తన కలల ప్రాజెక్టుగా తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ సినిమా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా గుణశేఖర్ కి హిట్స్ ఏమీ లేవు.. దాంతో ఆయనతో నటించేందుకు అగ్ర హీరోలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రుద్రమదేవికి మరో భాగంగా ప్రతాపరుద్రుడు సినిమాను తెరకెక్కిస్తానని చెప్పిన గుణశేఖర్, అందుకు సంబంధించిన రీసెర్చ్ కూడా మొదలుపెట్టారు.
ఈ సినిమాని ఓ స్టార్ హీరోతో తెరకెక్కించాలన్నది ఆయన ఉద్దేశం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన అందాల నటి సమంతతో ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా, చిత్రీకరణ పరంగా 50 శాతం పూర్తయింది. ఈ సినిమా తరువాత ఆయన ‘హిరణ్యకశిప’ చేయాలనే నిర్ణయంతోనే ఉన్నారు. అన్నీ సిద్ధంగానే ఉండటం వలన ఆ సినిమా చకచకా పూర్తవుతుందనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన మరో ప్రతిష్టాత్మ ప్రాజెక్ట్ కూడా మొదలు పెట్టబోతున్నారట.. అదే ‘ప్రతాపరుద్రుడు’ .
లాక్ డౌన్ సమయంలో ఈ కథపై ఆయన పూర్తిస్థాయి కసరత్తు చేశారట. అయితే ఈ కథకి మహేశ్ బాబు అయితే బాగుంటాడనే ఉద్దేశ్యంలో ఉన్నారట గుణశేఖర్. ఒక్కడు, అర్జున్, సైనికుడు ఇలా ఈ కాంబోలో వరుసగా మూడు సినిమాలొచ్చాయి. సైనికుడు డిజాస్టర్ అయ్యింది. అయినా సరే.. గుణ శేఖర్ అప్పుడప్పుడు మహేష్ కీ టచ్లోనే ఉన్నారు. ఈ తరహా పాత్రలు మహేష్ కీ కొత్తగా ఉంటాయి. ఒకవేళ.. మహేష్ నో
అంటే అప్పుడు రానాతోనే.. ఈ సినిమా పట్టాలెక్కించాలని భావిస్తున్నారట.
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పీఆర్సీ, లాక్ డౌన్ పై కీలక నిర్ణయం!