Sunday, April 28, 2024
- Advertisement -

మహేష్ ఎమోషన్..ఇకపై మీరే అమ్మా,నాన్న!

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ గుంటూరులో ఘనంగా జరుగగా ఈ సందర్భంగా మహేష్ బాబు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. తన తల్లి,దండ్రులను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు మహేష్. సంక్రాంతి తనకు బాగా కలిసొచ్చిన పండుగ… మా సినిమా సంక్రాంతికి రిలీజైతే హిట్టేనని చెప్పారు. నా సినిమా రిలీజ్ కాగానే నాన్న ఫోన్ కోసం ఎదురుచూసేవాడిని. కానీ ఈసారి ఆయన లేరు. నా సినిమా ఎలా ఉందో మీరే చెప్పాలి…. ఇకపై మీరే నాకు అమ్మా, నాన్న అని ఎమోషనల్ అయ్యారు.

త్రివిక్రమ్ అంటే తనకు చాలా ఇష్టమని, స్నేహితుడు కంటే ఎక్కువ, నా కుటుంబ సభ్యుడిలాగా అని చెప్పుకొచ్చారు. నేను ఆయన గురించి బయట ఎప్పుడూ మాట్లాడను. మన ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ ఏం మాట్లాడతాం. కానీ ఈ గత రెండు సంవత్సరాలు ఆయన నాకిచ్చిన సపోర్ట్, స్ట్రెంత్ నేనెప్పుడూ మర్చిపోలేను అన్నారు. ఈ సినిమాలో ఒక కొత్త మహేష్ బాబుని చూడబోతున్నారన్నారు.

చాలారోజుల తర్వాత ఒక తెలుగమ్మాయి పెద్ద హీరోయిన్ కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. హార్డ్ వర్క్ చేసే డెడికేటెడ్ ఆర్టిస్టులలో ఆమె ఒకరు. ఆమె షాట్ చిత్రీకరణ లేకపోయినా అక్కడే ఉంటుందన్నారు. ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయాలంటే హీరోలందరి తాట ఉడిపోతుందన్నారు. పాతిక సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ప్రతి ఏడాది అది పెరుగుతూనే ఉంది. మీరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు అని చెప్పారు మహేష్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -