సంక్రాంతి రేసులో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. అయితే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది ఈ చిత్రం.
అయితే వసూళ్లలో మాత్రం జోరు తగ్గడం లేదు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుండగా ఇప్పటివరకు రూ.175 కోట్లకు పైగా రాబట్టగా ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి రూ.200 కోట్ల గ్రాస్ మార్క్ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా మహేష్ సినిమాలు రూ.200 కోట్ల గ్రాస్ను ఐదు అందుకున్నాయి.
భారత్ అనే నేను సినిమా నుండి సర్కార్ వారి పాట వరకు రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకున్నాయి. భారత్ అనే నేనురూ. 225 కోట్ల గ్రాస్ రాబట్టగా తర్వాత మహర్షి, సరిలేరు నీకెవ్వరూ రూ.100 కోట్ల షేర్ ని అందుకున్నాయి. ఇక 2022లో వచ్చిన సర్కారు వారి పాట రూ. 230 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. తాజాగా గుంటూరు కారంతో మరోసారి వసూళ్ల రారాజు అనిపించుకున్నారు మహేష్. ఇక తన నెక్ట్స్ సినిమా రాజమౌళితో చేస్తుండగా ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవడం ఖాయంగా తెలుస్తోంది.