తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్ని ఆంక్షలు విధించిన ప్రజలు చేస్తున్న తప్పుల వల్ల ఈ కేసులు బాగా పెరిగిపోతున్నాయని ప్రభుత్వాలు అంటున్నాయి. ఇక కరోనా సెలబ్రెటీలకు ముచ్చెమటలు పట్టిస్తుంది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ కాగా మరికొంత మంది చనిపోయారు. ఇటీవల పలు ఈవెంట్స్, షూటింగ్ లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకింది.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు సమాచారం. మహేశ్ వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ పరుశరామ్ తో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తన వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో మహేష్ బాబు ముందు జాగ్రత్త చర్యగా హూం క్వారంటైన్ లోకి వెళ్లినట్టు టాలీవుడ్ టాక్. దీంతో ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో #StaySafeMaheshAnna అనే హ్యాష్ట్యాగ్తో పోస్టులు చేస్తున్నారు. ఆయనకు కరోనా సోకకూడదని ప్రార్థనలు చేస్తున్నారు. ఇక కరోనా విజృంభణ నేపథ్యలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం