టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న మహర్షి సినిమాకు లీకులు తప్పడం లేదు. గతంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను షూటింగ్ టైమ్లో ఉండగానే బయటికి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ మహేశ్ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం మహేశ్ మహర్షి సినిమా పొలచ్చిలో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రికరించారు.
పల్లెటూరు కావడంతో మహేశ్ను చూడటానికి జనాలు ఎగబడ్డారు. వారిలో కొందరు షూటింగ్లో ఉన్న మహేశ్ను ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేష్ మీడియాతో మాట్లాడే సన్నివేశానికి సంబంధించిన ఫోటో లీకైంది. ఈ సినిమా కోసం మహేశ్ ఫస్ట్ టైమ్ ఫుల్గా గెడ్డం పెంచాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డె నటిస్తుంది. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు.
- Advertisement -
మళ్లీ లీకైన మహేశ్ బాబు ‘మహర్షి’
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
