సూపర్స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా మహర్షి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త బయటికి వస్తోంది. సినిమాను మొదట ఏప్రిల్ 5న విడుదల చేస్తామని ప్రకటించారు. తరువాత ఈ సినిమాను ఏప్రిల్ 25కి వాయిదా వేశామని చిత్ర నిర్మాతలలో ఒకరైనా దిల్ రాజు ప్రకటించారు. దీంతో దిల్ రాజుపై మహేశ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. తాజాగా ఈ సినిమాను మరోసారి వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి.
సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమాను మే నేలలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ఇప్పటికే రెండుసార్లు సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి సినిమాను వాయిదా వేయడంతో మహేశ్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. పూజా హెగ్డె హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో నిర్మాతలే చెప్పాలి అంటున్నారు మహేశ్ ఫ్యాన్స్.
- Advertisement -
మరోసారి వాయిదా పడ్డ మహేశ్ బాబు ‘మహర్షి’..?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -