టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమా టీజర్ నిన్ననే విడుదల అయింది. ఇప్పుడు ఈ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. టీజర్ విడుదల అయిన కొద్ది గంటల్లోనే టీజర్ మిలియన్ వ్యూస్ సాధించింది. ఉగాది కానుకగా మహర్షి మూవీ నుంచి ఈ టీజర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక టీజర్ విడుదల అయిన కొద్ది గంటల్లోనే 11 మిలియన్ల వ్యూస్ సాధించి ఆల్టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. టీజర్ విడుదల చేసి 24 గంటలు కాకముందే ఇన్ని మిలియన్స్ రావడంపై మహేశ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
క్లాస్ను మాస్ను టచ్ చేసిన ఈ టీజర్.. సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. స్టైలీష్ లుక్తో పాటు, మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగానూ.. యాక్షన్తో అదరగొట్టేశాడు మహేష్. పూజాహెగ్డే హీరోయిన్గా ఈ సినిమాకు వంశీ పైడిపైల్లి దర్శకత్వం వహించాడు. ఇక సినిమాను మే 9న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భరత్ అనే నేను వంటి బ్లాక్ బాస్టర్ తరువాత మహేశ్ బాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ సినిమా మహేశ్ కెరీర్లో 25వ సినిమా కావడంతో చాలా ప్రతీష్టాత్మకంగా మహర్షిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్ ఫస్ట్ టైం గెడ్డం, మీసం పెంచిన సంగతి అందరికి తెలిసిందే.