Tuesday, May 7, 2024
- Advertisement -

తల‌పాగ‌తో అద‌ర‌గొడుతున్న మ‌హేష్ బాబు

- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్నకొద్ది సినిమా ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచింది.ఇప్ప‌టికే విడుద‌ల అయిన టీజ‌ర్‌,ఓత్‌,సాంగ్స్,మ‌హేష్ బాబు లుక్స్ సూప‌ర్‌గా ఉండ‌టంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.ఈ సినిమా ప్రీ రీలిజ్ ఈవెంట్ ఈ నెల 7వ తేదిన ఎల్‌బి స్టేడియంలో జ‌ర‌గ‌నుంది.ఈ ఫంక్ష‌న్‌ను సీఎం ప్ర‌మాణాస్వీక‌రం జ‌రిగినట్లుగా చేయ‌ల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది.ఇప్పుడు తాజాగా మ‌హేష్ బాబు కొత్త ఫోటో వైర‌ల్‌గా మారింది.ఈ ఫోటోలో మ‌హేష్ త‌ల క‌ట్టుతో ఉన్నాడు. ఈ పిక్‌ని చూస్తుంటే ఇది ఏదో సాంగ్‌లో వ‌చ్చే సీన్‌లా ఉంది.ఉగాది నాడు మ‌హేష్ బాబు పంచె కట్టు లుక్‌ని విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ ,ఇప్ప‌డు తాజా ఫోటోని ప్రీ రీలిజ్ నాడు విడుద‌ల చేయ‌ల‌ని భావించిన‌ట్లు తెలుస్తుంది.కాని లోపే ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చింది.

మ‌హేష్ బాబు పంచె క‌ట్టి,త‌ల పాగా చుట్టిన ప్ర‌తి సినిమా ఇండ‌స్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన మ‌హేష్ బాబు అభిమాన‌లు ఈ సినిమా కుడా ఇండ‌స్ట్రీ హిట్‌గా భావిస్తున్నారు.ప్రీ రీలిజ్‌కు ఎన్టీఆర్‌,రాంచ‌ర‌ణ్ ముఖ్య అతిధుల‌గా వ‌స్తున్నార‌నే వార్తలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.కొర‌టాల శివ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.కైరా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది.దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ నెల 20న సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -