Friday, April 26, 2024
- Advertisement -

కరోనా వైరస్ పై మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్.. ఏంటంటే?

- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ ప్రళయం సృష్టిస్తోంది.ఈ క్రమంలోనే రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అధికమవడంతో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో ఆక్సిజన్ పడకల సౌకర్యం లభించక ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొందరు సరైన సమయంలో ఆక్సిజన్ దొరకకపోవడం వల్ల మరణిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ మహమ్మారి పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని గత ఏడాది నుంచి ఎంతో మంది సెలబ్రిటీలు ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వైరస్ గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:వామ్మో.. అల్లరి నరేష్ సినిమాలో దారుణమైన బూతులు..!

“రోజురోజుకు దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించండి.. అవసరమైతే తప్ప ఎవరు బయటకు వెళ్లకూడదని,ఒకవేళ కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే స్వీయ నిర్బంధంలో వెళ్లి డాక్టర్ల సలహాలు పాటిస్తూ ఉండాలని,ప్రతిరోజు ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటూ తప్పదనే పరిస్థితులలో మాత్రమే ఆస్పత్రికి చేరాలని ఈ విధంగా ఉన్నప్పుడే అత్యవసర పరిస్థితులలో ఉన్న వారికి ఆస్పత్రిలో అన్ని సదుపాయాలు దొరుకుతాయి. అప్పుడే ఈ క్లిష్ట పరిస్థితుల్లో నుంచి మనం బయటపడగలుగుతాము”. అంటూ మహేష్ బాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Also read:ఈ టాలీవుడ్ హీరోలు అందరూ అలా కష్టపడే పైకి వచ్చారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -