Wednesday, May 15, 2024
- Advertisement -

అడ్వాన్స్‌ బుకింగ్‌తో అదరగొడుతున్న శ్రీమంతుడు!

- Advertisement -

మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శ్రీమంతుడు సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్  స్టార్ట్  అవ్వగానే హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.  చాలా కాలంగా ఎదురుచూస్తున్న తమ అభిమాన హీరో సినిమా మొదటి రోజే చూడాలని అభిమానులు టికెట్స్ కోసం పోటీ పడుతున్నారు.

ఇప్పటికే థియేటర్స్‌లో ఆల్మోస్ట్ పుల్ అయిపోయాయి. దీంతో శ్రీమంతుడు మూవీ టికెట్స్‌కి మంచి డిమాండ్ ఏర్పడుతోంది. మహేశ్‍ బాబు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అలానే మహేశ్ అభిమానులు కూడా ఈ సినిమాపై హిట్ కావాలని ఆశలు పెట్టుకున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్  చేస్తున్నారు. మహేశ్‌బాబు తండ్రిగా జగపతిబాబు, హీరోయిన్‌గా శ్రుతిహాసన్ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ శ్రీమంతుడు ఆగష్టు 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది . 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -