Tuesday, May 21, 2024
- Advertisement -

మహేష్ స్పైడర్ స్టోరీ ఇదేనా..?

- Advertisement -

మహేష్ బాబు హీరోగా.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా స్పైడర్. ఈ సినిమా ఇటివలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని.. ఫ్రి రిలీజ్ పంక్షను కూడా కంప్లీట్ చేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇటివలే తమిళంలో కూడా ఈ సినిమా ఆడియో వేడుక జరిగింది.

అయితే తమిళంలో కూడా మహేష్ బాబు డబ్బింగ్ చెప్పుతుండటం విశేషం. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎస్ జే సూర్య నటిస్తుండగా.. హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. అయితే ఇటివలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ కి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఎవరైన కష్టాల్లో ఉంటే మహేష్ బాబు కు సమాచారం వస్తోంది. దాంతో సమాచారం తెలుసుకున్న మహేష్ బాబు వారికి ఉన్న కష్టాలను తీరుస్తుంటాడు.

ఇదే టైంలో అనుకొని విధంగా.. విలన్ ఎస్ జే సూర్య.. ప్రజలను ఎలా అంతం చేయాలని ప్లాన్ చేస్తుంటాడు. ఆ క్రమంలో మనుషులను చంపడం చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు.. ఆ విలన్ ను ఎలా అంతం చేశాడు.. ప్రజలను ఎలా కాపాడాడు అనేది కథ. అయితే ఈ కథ నిజమో.. కాదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ స్టోరీ వైరల్ అవుతుంది. మరి సినిమా వచ్చే వరకు స్టోరీ కోసం వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -