సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. మహేశ్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డె నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ను మొదలుపెట్టిన చిత్ర యూనిట్, తాజాగా ఉగాది పండక్కి అభిమానులకు ఓ సరఫ్రైజ్ ప్లాన్ చేసింది. ఉగాది పండక్కి సినిమా నుంచి టీజర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్కు విపరీతమైన రెస్పన్స్ వచ్చింది. పండగ సందర్భంగా సినిమా నుంచి టీజర్ను విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారట. దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం దగ్గరుండి టీజర్ను కట్ చేయిస్తున్నాడని సమాచారం.
ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఓ పాట మినహా మిగిలిన సినిమా మొత్తం పూర్తైంది. ఆ పాటను కూడా త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని చూస్తున్నారు. సినిమాను ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మహర్షి సినిమా మహేశ్ కెరీర్లో 25వ సినిమా కావడంతో విశేషం. దీంతో ఈ సినిమాను చాలా ప్రతీష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు. పీవీపీ, దిల్ రాజు, అశ్వినీదత్ ముగ్గురు కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.