Wednesday, April 24, 2024
- Advertisement -

జూలై ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి ‘సర్కారు వారిపాట’..!

- Advertisement -

సర్కారువారి పాట సినిమా కోసం మహేశ్​ ఫ్యాన్స్​తోపాటు సినీ అభిమానులంతా ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే లాక్​డౌన్​ ఎఫెక్ట్​తో షూటింగ్​ ఆగిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో లాక్​డౌన్​ ఎత్తేశారు. థియేటర్లు కూడా తొందర్లోనే తెరుచుకొనే అవకాశం ఉంది. లాక్​డౌన్​ పూర్తిగా ఎత్తేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో షూటింగ్​లు, థియేటర్లలో సినిమాలు విడుదల చేసుకొనేందుకు తెలంగాణలో ఫుల్​ పర్మీషన్​ వచ్చినట్టే. అయితే ఆంధ్రప్రదేశ్​లో ఇంకా కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి.

కొన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్​లను ఇప్పటికే ప్రారంభించారు. షూటింగ్​ చివరి దశ కు చేరుకున్న సినిమాలకు ముందుగా అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో సర్కారువారి పాట .. షూటింగ్​ కూడా ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్​ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్​ లో ఉండగా షూటింగ్ నిలిచిపోయింది. తిరిగి త్వరలోనే ఈ సినిమా ప్రారంభించబోతున్నారు.

Also Read: షూటింగ్ లు ప్రారంభం .. ఆ సినిమాలకే ప్రాధాన్యం..!

సర్కారువారి పాట సినిమాలో కీర్తిసురేశ్​ హీరోయిన్​గా నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పరశురామ్​ డైరెక్షన్​లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నది. బ్యాంకు దోపిడీలు, ఆర్థికవ్యవహారాలకు సంబంధించిన ఓ డిఫరెంట్ సబ్జెక్ట్​తో ఓ మూవీ రాబోతున్నదట.

Also Read: ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్​ డేట్​ ఫిక్స్​.. మరి రిలీజ్​ ఎప్పుడో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -