కరోనా సెకండ్ వేవ్ క్రమంగా అదుపులోకి వస్తున్నది. కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. ఈ క్రమంలో లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఫిలిం చాంబర్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. షూటింగ్లకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో చాలా సినిమాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే షూటింగ్ తుదిదశకు చేరుకున్న సినిమాకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఫిలిం చాంబర్ నిర్ణయం తీసుకున్నది. ముందుగా తుదిదశకు చేరుకున్న సినిమాల షూటింగ్ పూర్తయ్యాకే మిగిలిన షూటింగ్లు ప్రారంభించాలని నిర్ణయించింది. థియేటర్లు ఓపెన్ అయితే విడుదల చేసేందుకు పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఫిలిం చాంబర్ ముందుకు షూటింగ్ తుది దశకు చేరుకున్న సినిమాలకు అవకాశం కల్పించింది.
Also Read: ఇక చక చకా ఆదిపురుష్ షూటింగ్.. ప్రభాస్ లేకుండానే..!
మరోవైపు కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నాయి. తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 20తో కరోనా పొడిగింపు పూర్తికాబోతున్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని క్యాబినేట్ సమావేశమై లాక్డౌన్పై తుది నిర్ణయం తీసుకొనే చాన్స్ ఉంది.
Also Read: బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!