ఒమన్లో మహేశ్ కుటుంబం సందడి
కొత్త సంవత్సర వేడుకలను మహేశ్బాబు కుంటుబంతో స్వాగతం పలికాడు. కుటుంబంతో సహా విదేశాలకు వెళ్లి అక్కడ ఎంజాయ్ చేశాడు. ఇంటిల్లిపాదితో పాటు తన సన్నిహిత స్నేహితులతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాడని మహేశ్ భార్య నమత్ర ద్వారా తెలిసింది. ఆమె సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. మహేశ్ కన్నా ఆమెకే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు.
అయితే ఇటీవల ఒమన్ దేశంలో మహేశ్ కుటుంబం సందడి చేశారు. మహేష్ షూటింగ్ల్లో గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్స్ను సందర్శనీయ ప్రదేశాలకు తీసుకెళ్తుంటాడు. అలా ఒమన్లో కొడుకుతో కలిసి మహేశ్ పారా గ్లైడింగ్ చేశాడు. మహేశ్తోపాటు అతడి కొడుకు గౌతమ్ కూడా తండ్రితో పాటు ఉత్సాహంగా పారా గ్లైడింగ్ చేశాడు. రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరిపోయే అనుభూతిని సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతుండగా తీసిన ఫొటోలను మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ‘‘పారాగ్లైడర్లుగా నా సూపర్ హీరోలు.. తండ్రిలాగే కొడుకు’’ అంటూ కామెంట్ పెట్టి సంతోషం వ్యక్తం చేశారు. మహేశ్ అభిమానులంతా కుటుంబంపై మహేశ్ చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయిపోయారు.
శ్రీమంతుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శ్రీను దర్శకత్వంలో ‘‘భరత్ అనే నేను’’ సినిమాలో మహేశ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. మహేశ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది.
https://youtu.be/qBmgXqR5sWw