Tuesday, May 14, 2024
- Advertisement -

బాలయ్యకు మహేశ్.. భారీ ఆర్థిక సాయం!

- Advertisement -

మరోసారి శ్రీమంతుడు అనిపించుకొంటున్నాడు ప్రిన్స్ మహేశ్ బాబు. సినిమాలో శ్రీమంతుడిగా దర్శనమిచ్చి ఆ తర్వాత రెండూళ్లను దత్తత తీసుకున్న ప్రిన్స్ ఇప్పుడు మరో దాతృత్వ కార్యక్రమాన్ని చేపట్టాడు. శ్రీమంతుడు సైకిల్ వేలం ద్వారా లభించిన సొమ్మును డొనేట్ చేశాడు మహేశ్.

భారీ మొత్తంలో సమకూరిన ఈ మొత్తంలో పదిహేను లక్షల రూపాయలను ప్రిన్స్ బాలయ్యకు డొనేట్ చేయడం మరింత విశేషం. మరి బాలయ్యకు డొనేట్ చేయడం ఏమిటి? అం టే… బాలయ్య ఆధ్వర్యంలోని బసవతారకం క్యాన్స్ హాస్పిటల్ కు విరాళంగా ఇచ్చాడు మహేశ్ బాబు. తల్లి పేరుతో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ కు బాలయ్య చైర్మన్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ హాస్పిటల్ చాలా మందికి వైద్య సేవలు అందించడంలో పేరు తెచ్చుకుంది.

విరాళాల సేకరణ విషయంలో స్వయంగా బాలయ్య చొరవచూపుతూ ఉంటాడు. విదేశాలకు వెళ్లి మరీ విరాళాలను సేకరిస్తూ ఉంటాడు. ఇలాంటి నేపథ్యంలో మహేశ్ బాబు బాలయ్య ఆధ్వర్యంలోని సంస్థకు విరాళం ఇచ్చాడు. మరి ఒక తెలుగు హీరో ఆధ్వర్యంలోని కంపెనీ కి మరో తెలుగు హీరో తన అభిమాను లనుంచి సేకరించిన సొమ్మును విరాళంగా ఇవ్వడం విశేషమే కదా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -