Friday, May 10, 2024
- Advertisement -

మహేశ్ సినిమాలపై బాంబు పేల్చిన న‌మ్ర‌తా….

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మహర్షి సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 24.6 కోట్ల షేర్‌ సాధించింది. బాక్సాఫీసు వ‌ద్ద విజ‌యంతో దూసుకుపోతోంది. త‌న బ‌ర్త మ‌హేష్ బాబు సినిమాల‌పై న‌మ్ర‌తా బాంబు పేల్చారు.

హీరోయిన్ గా తన కెరీర్ టాప్ లో ఉన్న సమయంలోనే మహేశ్ బాబుతో నమ్రతా శిరోద్కర్ ప్రేమలో పడిపోయారు. మహేశ్ ను పెళ్లి చేసుకోవడానికి దాదాపు ఐదేళ్లు వేచి చూసిన న‌మ్ర‌తా త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. తన వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మహేశ్ కెరీరే తనకు ముఖ్యమని చెప్పారు. తాను మహేశ్ సినిమాలను అసలు చూడనని… ఆయన సినిమాలు తనను చాలా ఒత్తిడికి గురి చేస్తాయని తెలిపారు.

అందరిలాగానే తమ కుటుంబసభ్యులు మహేశ్ సినిమా ప్రివ్యూలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారని… తాను మాత్రం ఇంట్లో కూర్చొని, గోళ్లు కొరుకుతూ, సినిమా హిట్ కావాలని భగవంతుడిని ప్రార్థిస్తుంటానని నమ్రత చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -