Saturday, April 27, 2024
- Advertisement -

మహేష్‌ బాబు సర్జరీపై స్పందించిన నమ్రత

- Advertisement -

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మోకాలు సర్జరీరై ఆయన సతీమణి నమ్రత స్పందించారు. మహేష్‌కు సర్జరీ జరిగింది వాస్తవేనని అంగీకరించారు. అయితే అభిమానులు ఎవరూ కంగూరు పడాల్సిన పని లేదని ఆయనకు జరిగింది చాలా స్వల్ప సర్జరీ అని క్లారిటీ ఇచ్చారు.

2017లో స్పైడర్‌ సినిమా సందర్భంగా మహేష్‌ బాబు గాయపడ్డారని సమాచారం. కాగా ఇటీవల సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ సందర్భంగా పాత గాయం మరోసారి తిరిగబెట్టడంతో వైద్యుల సూచన మేరకు మహేష్‌ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం స్పెయిన్‌లో ఉ‍న్న మహేష్‌ అక్కడి నుంచి నేరుగా దుబాయి వెళతారు. భార్యాపిల్లలు నమ్రత, గౌతమ్‌, సితారలు సైతం హైదరాబాద్‌ నుంచి నేరుగా దుబాయి వెళ్లనున్నట్టు సమాచారం.

కొత్త సంవత్సరం వేడుకలకు గాను ముందుగానే కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌ ట్రిప్‌కు మహేష్‌ ప్లాన్‌ వేసుకున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే కొత్త యేడాది వేడుకలకు దుబాయ్‌కి వెళతారు. ప్రస్తుతం మహేష్‌ బాబు ప్పెయిన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

షాక్‌లో మెగా ఫాన్స్‌

చైతూ విషయంపై మాట్లాడదలుచుకోలేదు

కోటి కావాలంటున్న మెహరీన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -