సినిమా హీరో, హీరోయిన్లు కనిపిస్తే.. ఒక్క ఫోటో అయిన దిగాలని ఆశపడుతారు చాలా మంది. అయితే ఇప్పుడు ఒక ఫ్యాన్ కాస్త వికృతంగా ప్రవర్తించాడు. 2007లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న సెక్సిణి ఈషా గుప్తా.. మూవీస్ లో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ.. ఫ్యాషన్ రంగంలో మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది.
అందుకే మొన్న దుబాయ్ లో ఒక ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి వెళ్లింది. అయితే తన ర్యాంప్ వాక్ ముగించిన ఒకసారి బాత్రూమ్ కు వెళదాం అనుకున్న అమ్మడికి.. ఆమె వెంటనే అభిమానులు పరిగెత్తుతూ రావడం కనిపించిందంట. సర్లే అనుకుని ఆమె అలా లేడీస్ వాష్ రూమ్ వరకు వెళ్తే.. ఓ అభిమాని ఆమె వెంటే లోపలికి కూడా వచ్చేశాడట. ఒక్క సెల్ఫీ కావాలి ప్లీజ్ అంటూ మారాం చేశాడట.
ఇది వాష్ రూమ్ కదా.. ఇక్కడ సెల్ఫీలు ఏంటి.. అని ఈషా ప్రశ్నించినా కూడా.. ఆ విచిత్ర అభిమాని అస్సలు తగ్గలేదట. వెంటనే సెక్యూరిటీ వారికి చెప్పగా.. వారు అతడ్ని లొంగదీసుకున్నారు. కాకపోతే అతడు నిజంగా సెల్ఫీ కోసం వచ్చాడని అనిపించడంతో.. ఈషా అతనిపై ఎటువంటి లీగల్ చర్యలూ తీసుకోబోవట్లేదు. మొత్తానికి సెల్ఫీ పిచ్చితో ఆ అభిమాని తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. అసలే దుబాయ్.. ఒకవేళ ఈషా కనుక కేస్ పెడితే.. అతడు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వచ్చేది.
{youtube}7mtaTaZlRYo{/youtube}
Related