హీరో మంచు మనోజ్ రాజకీయలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఆయన ఏపార్టీలో చేరతారో తెలియడం లేదు.ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయపార్టీలతో మంచ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి.మంచు మోహన్ బాబు అప్పట్లో టీడీపీకి సానుభుతిపరుడిగా ఉండేవారు.కాని తరువాత కాలంలో ఆయన చంద్రబాబు తీరుతో అసహనం చెంది పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బంధువుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.దీంతో వైఎస్ ఫ్యామిలీతో సత్ససంబంధాలు కొనసాగించారు మోహన్ బాబు.
మోహన్ బాబు ఎప్పటి నుంచో తాను త్వరలోనే ఓ రాజకీయ పార్టీలో చేరతానని ప్రకటించారు.జగన్ కుటుంబంతో ఉన్న బంధం మేరకు అతడు వైఎస్ఆర్ సీపీ పార్టీలో జాయిన్ అవుతారని భావించారు.అయితే గత కాలంగా సినిమాకు దూరంగా ఉంటున్న మనోజ్ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది.మనోజ్ అటు టీడీపీ ,ఇటు వైసీపీ పార్టీలు కాకుండా నటడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం.ఇదే కనుక నిజం అయితే ఏకాకి అయిన పవన్ కల్యాణ్కు ఓ తోడు దొరికినట్లు అవుతుంది.ప్రస్తుతం పవన్ పొగుడుతు మనోజ్ చూసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.