తీసింది ఐదు సినిమాలు ఆడినవి మాత్రం రెండో.. మూడో.అన్నీ కలిపి ఆయనకు పెద్దగా ఉపయోగ పడలేదు. అంతగా ఫ్లాపులు తీసిన దర్శకుడు ఇప్పుడు మరో సినిమా తీయనున్నాడు. అయితే ఈ సినిమాకు అవకాశం ఇచ్చింది.. ఓ యావరేజ్ హీరో. వారిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తోంది. మరీ ఆ సినిమానైనా ఆడి వారిద్దరి భవిష్యత్ బాగుంటుందో లేదో చూడాలి.
పూరి జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసి దర్శకుడి పరశురామ్ పరిచయమయ్యాడు. తొలి సినిమా ‘యువత’ను బాగానే తీశాడు. కానీ అంతగా ఆడలేదు. రెండో సినిమా ‘ఆంజనేయులు’ ఫ్లాప్ కాగా తర్వాత ‘సోలో’తో బాగానే తీసినా ‘సారొచ్చారు’ దెబ్బకొట్టింది. ఆ తర్వాత ‘శ్రీరస్తు శుభమస్తు’ బాగానే తీశాడు. అతడి ప్రతిభకు మెచ్చి అల్లు అరవింద్ అతడి తర్వాతి సినిమాను కూడా తాను నిర్మిస్తానని ప్రకటించాడు. పరశురామ్ తర్వాతి సినిమా మంచు కుటుంబంతో చేయనున్నట్టు సమాచారం. మంచు విష్ణు నటుడిగా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమాకు అన్నీ సిద్ధమయ్యాయి. మంచు వాళ్ల సొంత బ్యానర్లో ఈ సినిమా రాబోతోందని, ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తారంట. ప్రస్తుతం విష్ణు.. ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘ఓటరు’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగేశ్వరరెడ్డితోనూ ఓ సినిమాలో నటించాడనికి అంగీకరించాడు.
ఈలోపు పరశురామ్ ‘అర్జున్ రెడ్డి’ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విష్ణుతో కలిసి సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉంది.