Saturday, April 27, 2024
- Advertisement -

మణిరత్నం సినిమా.. రీమేక్ అవుతోంది..!

- Advertisement -

వరస ప్లాఫుల్లో ఉన్న దర్శకరత్నం మణిరత్నానికి కొంత ఊరటనిచ్చిన సినిమా ‘ఓకే బంగారం’ . లివింగ్ రిలేషన్ షిప్ కాన్సెప్ట్ పై సినిమా తీసి ఈ తరానికి కూడా దగ్గరయ్యాడు మణిరత్నం. ఆ సినిమా కమర్షియల్ గా కూడా సక్సెస్ అనిపించుకుంది.

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ లు జంటగా నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల మెప్పు పొందింది. మామూలుగా మణిరత్నం సినిమాలు హిందీలోకి కూడా డబ్ అవుతూ ఉంటాయి. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కావడం మణి కెరీర్ లో సహజంగా జరుగుతూ వస్తోంది. కానీ… ‘ఓకే బంగారం’ సినిమా మాత్రం కేవలం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే విడుదల అయ్యింది.

ఇలాంటి నేపథ్యంలో ఈ సక్సెస్ ఫుల్ సబ్జెక్టును హిందీలోకి కూడా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు  మణిరత్నం. ఆయన శిష్యుడు ఒకరు ఈ సినిమా హిందీ వెంచర్ కు దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించనున్నారట. త్వరలోనే అక్కడ రీమేక్ పనులు మొదలు కానున్నాయి. ఈ సినిమా హిందీ వెర్షన్ లో “ఆషికీ-2′ సినిమా లో జంట నటించే అవకాశం ఉంది. సూపర్ హిట్ గా నిలిచిన ఆ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన సిద్ధార్థ్ రాయ్ కపూర్, శద్ధాకపూర్ లు హీరోహీరోయిన్లుగా నటించనున్నారని తెలుస్తోంది. మరి మణిరత్నం సబ్జెక్ట్ హిందీలో ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -