Wednesday, May 15, 2024
- Advertisement -

ప్లే బాయ్ గా మారనున్న ‘మన్మధుడు’

- Advertisement -

అక్కినేని నాగార్జున కెరియర్ లో ‘మన్మధుడు’ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా ‘మన్మధుడు 2’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మధ్యనే ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇవాళ విడుదల కానుంది. కేవలం ఒక్క నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో మొదట నాగార్జున లేటు వయసులో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి గా కనిపిస్తాడు.

‘మన్మధుడు’ సినిమాలో అమ్మాయిల అనే అంటే గిట్టని పాత్ర పోషించిన నాగార్జున ఇప్పుడు ప్లే బాయ్ తరహా పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో కామెడీతో పాటు రొమాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దేవదర్శిని, లక్ష్మి, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు ఈ సినిమాలో అక్కినేని కోడలు సమంత, కీర్తి సురేష్ మరియు అక్షర గౌడ గెస్ట్ పాత్రల్లో కనిపించబోతున్నారు. నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించనున్నారు. ‘మన్మధుడు’ సినిమా లాగానే ‘మన్మధుడు 2’ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -