Saturday, April 20, 2024
- Advertisement -

ఉపాసన తాత పాడే మోసిన చిరు, చరణ్..!

- Advertisement -

తన కోడలు ఉపాసన తాత చనిపోతే అన్ని తానే వ్యవహరించారు చిరంజీవి. ఏకంగా ఆయన అంత్యక్రియలను ఘనంగా నిర్వహించారు. స్వయంగా చిరంజీవి రామ్ చరణ్ పాడే మోయడం ప్రాధన్యత సంతరించుకుంది. మెగా స్టార్ కోడలు ఉపాసన వాళ్ల తాత మాజీ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి.

కామారెడ్డి జిల్లా దోమకొండ కోట వారసుడు అయిన ఉమాపతిరావు అస్వస్థతతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని ఆదివారం దోమకొండకు తీసుకొచ్చారు. ఆయన కుమార్తె అమెరికాలో ఉండటం వల్ల.. ఆమె రాక ఆలస్యం కావడంతో అంత్యక్రియలకు లేటు అయింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కోటలోని వెంకట భవనంలో ప్రజల సందర్శనార్థం ఉమపతిరావు భౌతికకాయాన్ని ఉంచారు.

అనంతరం స్థానిక ముత్యంపేట రోడ్డులోని లక్ష్మీబాగ్ లో ఉమాపతిరావు అంతిమ సంస్కారాలను ఆయన కుమారుడు అనిల్ కుమార్-శోభన దంపతులు నిర్వహించారు. అంత్యక్రియలకు మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఉమాపతిరావు అంతిమయాత్రలో చిరంజీవి రాంచరణ్ లు స్వయంగా పాల్గొని ఆయన పాడెను మోయడం అందరినీ ఆకట్టుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -