Tuesday, April 30, 2024
- Advertisement -

మెగాస్టార్ నుంచి అభినందనలు పొందిన యువహీరో

- Advertisement -

చాలా కాలం తర్వాత యువ హీరో సందీప్ కిషన్ ఒక మర్చిపోలేని హిట్ ను అందుకున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. సందీప్ కిషన్, అన్య సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, మురళి శర్మ, మరియు పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా సందీప్ కిషన్ కి ఒక మంచి హిట్ ను అందించింది. ఈ నేపథ్యంలో అభిమానులు నుంచి మాత్రమే కాకుండా సందీప్ కిషన్ కు మెగాస్టార్ చిరంజీవి తరపు నుంచి కూడా శుభాకాంక్షలు లభించాయి.

తాజాగా ‘నిను వీడని నీడను నేనే’ సినిమా సక్సెస్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సందీప్ కిషన్ ను అభినందించారు. ఒక బొకే ఇచ్చి సందీప్ కిషన్ ని అభినందించిన చిరంజీవి పలు ఫోటోలు కూడా దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా చిరంజీవి సందీప్ కిషన్ తదుపరి సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకున్నారట. సందీప్ కిషన్ చేతిలో ప్రస్తుతం ‘తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్’ మరియు వెంకటాద్రి టాకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఒక సినిమా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -