Wednesday, April 24, 2024
- Advertisement -

పెళ్లిపీట‌లెక్క‌డానికి రెడీ అయిన మిర్చి భామ‌..

- Advertisement -

ప్రభాస్ సరసన మిర్చి సినిమాలో కథానాయికగా నటించింది రిచా గంగోపాథ్యాయ్ పెళ్లిపీట లెక్కేందుకు సిద్దం అయ్యింది. తనకు బిజినెస్‌ స్కూల్‌లో పరిచయం అయిన జోయ్ అనే వ్యక్తితో తన నిశ్చితార్థం జరిగినట్టుగా రిచా ప్రకటించారు. ప్రస్తుతానికి పెళ్లికి ముహూర్తం నిర్ణయించలేదని, జీవితంలో కొత్త మార్పుకోసం ఆనందంగా ఎదురుచూస్తున్నట్టుగా రిచా తెలిపారు.

రానా హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన భామ రిచా గంగోపాధ్యాయ. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకుముందు మాస్ మహారాజా రవితేజ సరసన మిరపకాయ్ లోనూ కథానాయికగా ఆడిపాడింది. గోపిచంద్ వాంటెడ్లోనూ రిచా నాయిక.

ఆశించిన స్థాయిలో స్టార్ డ‌మ్ రాక‌పోవ‌డంతో చ‌దువుల‌కోసం విదేశాల‌కు వెల్లింది. అక్కడే తన క్లాస్ మేట్ జోను రిచా పెళ్లాడబోతోందిట. తాజాగా హబ్బీ జోతో కలిసి ఉన్నప్పటి పోటోని రిచా తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. లీడ‌ర్ సినిమాతో మొద‌లైన సినీ లైఫ్ భాయ్ సినిమాతో సినీ కెరీర్ ముగిసింది.

మొత్తానికి రిచా సినిమాలకు స్వస్థి చెప్పి పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఇకపై సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పేసింది. అయితే చాలా మంది కథానాయికలు పెళ్లి తర్వాత సెకండ్ ఇన్సింగ్స్ కొనసాగించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, బెంగాళీ చిత్రాల్లోనూ నటించిన రిచా గంగోపాధ్యాయ సైమా వేడుకల్లో ఉత్తమ నటి (క్రిటిక్స్‌ ఛాయిస్‌) అవార్డును అందుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -