మెగా హీరోగా తెరకు పరిచియమైన అల్లు అర్జున్ తక్కువ కాలంలోనే తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అతని డ్యాన్స్తో చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు.కాని ఒక్క వివాస్పద వాఖ్యతో మెగా ఫ్యాన్స్కు నెగిటివ్గా మారాడు.‘చెప్పను బ్రదర్’’ అన్న ఒక్క మాటతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నెగిటివ్ అయ్యాడు బన్నీ. దాని ప్రభావం దువ్వాడ జగన్నాథమ్ సినిమా రీలిజ్ అప్పుడు బాగా పడింది.సినిమా బాగున్నా బాలేదని చాలానే కామెంట్లు వినిపించాయి.అప్పడు టార్గెట్ అయిన బన్నీ మళ్లీ ఇన్నాళ్లకు మళ్లీ చాలమందికి టార్గెట్గా మారాడు.
రీసెంట్ గా ఎక్స్ ప్రెస్ గ్రూప్ కు చెందిన ఒపీనియన్ ఎక్స్ ప్రెస్ అల్లు అర్జున్ ను కవర్ పేజ్ గా వేసి స్టయిలిష్ స్టార్ ఆఫ్ ది మిలీనియంగా ప్రకటించేసింది. బన్నీ ఇంటర్వ్యూ ప్రచురించింది.తనకు ఇనిస్పిరేషన్ మోడీ అంటూ చెప్పుకొచ్చాడు.ఇప్పుడు మోడీ పేరెత్తితే జనాలు మండిపడుతున్నారు.విభజన హామీల అమలులో మోడీ మాట మార్చిన తీరుపై ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉంది. ఇలాంటి టైంలో మోడీ ఏ రకంగా ఇన్స్పిరేషనో చెప్పాలంటూ ఓ తెలుగు వాడిగా చెప్పాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.