- Advertisement -
ఆది పినిశెట్టి కెరీర్ స్టార్టింగ్లో హీరోగా కొన్ని సినిమాలు చేసిన అవి పెద్దగా ఆకట్టుకొకపోవడంతో, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాడు.నిన్ను కోరి ,సరైనోడు,అజ్ఞాతవాసి,రంగస్థలం సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే ఆది పినిశెట్టి మరోసారి హీరోగా మారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాడు.
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నీవెవరో’.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.సస్పెన్ష్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే, డైలాగులు కోన వెంకట్ అందించారు.ఈ సినిమాకు హరినాథ్ దర్శకత్వం వహించారు.‘నీవెవరో’ ఫస్ట్ లుక్ పోస్టర్ను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు.