అల్లరి సినిమాతో వెండితెరకు పరిచయమై.. మొదట కామెడీ నేపథ్యంలో సినిమాలు చేసిన అల్లరి నరేష్.. ఆ తర్వాత చాలా భిన్నమైన కథలతో సినిమాలు చేశారు. ఇక నేను, గమ్యం వంటి సినిమాలతో తనలోని నటనా ప్రతిభతో విమర్శకుల ప్రశంసలు సైతం పొందాడు. తాజాగ అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నాంది’.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. నాంది చిత్రంతో నాలోని మరో కొత్త నరేష్ ని చూస్తారని తెలిపారు. గమ్యం సినిమా తర్వాత తనకు ఎంతో నచ్చిన కథతో వస్తున్న చిత్రమని తెలిపాడు. ఈ సినిమాలోని కంటినీరు మంటలాగ మారడానికి అనే పాట తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు.
కాగా, ఈ సినిమా ద్వారా కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి నిర్మతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్స్ నాందిపై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, నవమి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి దేవీ ప్రసాద్ తదితర నటీనటులు ఇందులో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
‘లైగర్’లో దుమ్ము లేపుతున్న అనన్య