Friday, May 17, 2024
- Advertisement -

సెట్స్‌పైకి శైల‌జారెడ్డి అల్లుడు

- Advertisement -

యుద్ధం శ‌ర‌ణం సినిమాతో ప‌రాజ‌యం పొందిన త‌ర్వాత అక్కినేని నాగచైతన్య ద‌ర్శ‌కుడు మారుతీ న‌మ్ముకున్నాడు. అత‌డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా శైల‌జారెడ్డి అల్లుడు. హాస్య‌భ‌రిత‌మైన సినిమాగా రూపొందుత‌న్న‌ట్టు స‌మాచారం. చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కొన‌సాగుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు మారుతి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫుల్‌ స్క్రిప్ట్‌తో రెడీ అ‍య్యాడు. ఈ నెల 19వ తేదీ నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ వివ‌రాల‌ను మారుతీ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు.

హైద‌రాబాద్ కోఠిలోని ఉమెన్స్ క‌ళాశాల‌లో చైతూ, హీరోయిన్ అనూ ఇమ్మానుయేల్‌ల‌పై షూటింగ్ చేస్తున్నారు. క‌ళాశాల స్థాయిలో ఇద్ద‌రి ప్రేమికుల మ‌ధ్య సీన్లు తీయ‌నున్నార‌ని స‌మాచారం.

ప్రస్తుతం చైతూ చందూ మొండేటి దర‍్శకత్వంలో `సవ్యసాచి` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో మారుతీ సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శైలజారెడ్డిగా శివ‌గామి పాత్ర‌ధారిణి రమ్యకృష్ణ న‌టించ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -