Saturday, April 27, 2024
- Advertisement -

లవ్ స్టోరీ సినిమా విడుదలయ్యేది అప్పుడే.. నిర్మాత క్లారిటీ!

- Advertisement -

అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ స్టోరీ” సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ 16న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కరోనా కేసుల తీవ్రత అధికమవుతుందన్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమా విడుదల గురించి గతంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. లవ్ స్టోరీ సినిమా థియేటర్ లో కాకుండా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం భావించారని వార్తలు వినిపించాయి.

అదే విధంగా ప్రస్తుతం కరోనా కేసులు తీవ్రత భారీగా తగ్గడంతో ఈ నెల చివరి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో యాభై శాతం సీట్ల భర్తీతో థియేటర్లు తెరుచుకోకున్నాయని వార్తలు పెద్దఎత్తున వినిపించడంతో లవ్ స్టోరీ సినిమా విడుదలకు సిద్ధం అవుతోందని పెద్ద ఎత్తున పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలోనే చిత్రబృందంలో ఒకరైన సునీల్ నారంగ్ చిత్రం విడుదల పై క్లారిటీ ఇచ్చారు.

Also read:ఎన్టీఆర్ ని ఢీ కొట్టనున్న విజయ్ సేతుపతి!

ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ ఎత్తేసిన తరువాత మాత్రమే సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని, థియేటర్ లో కేవలం మూడు ప్రదర్శనలకు అనుమతి ఇస్తే మా సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనుకోవడం లేదని, ప్రస్తుతం సినిమా విడుదల గురించి ఎవరు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోలేదనీ తెలిపారు. ఈ సినిమా విడుదల విషయం పూర్తిగా నైట్ కర్ఫ్యూ తీసేసిన తర్వాత మాత్రమే ఆలోచిస్తామని ఈ సందర్భంగా సునీల్ లవ్ స్టోరీ సినిమా విడుదల పై క్లారిటీ తెలియజేశారు.

Also read:హైపర్ ఆదికి కించపరచడం, రెచ్చిపోవడం అలవాటు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -