Tuesday, May 14, 2024
- Advertisement -

అఖిల్ 22 నే వస్తా అంటుంటే , వద్దంటున్న నాగర్జున !

- Advertisement -

రుద్రమదేవి, బ్రూస్లీ, అఖిల్ ఈ నెలలో సందడి చేయనున్న సినిమాలు. రుద్రమ దేవి ఇప్పటికే థియేటర్ లలో రన్నింగ్ లో ఉండగా బ్రూస్ లీ విడుదల మీద ఉన్న మీమాంస తొలగి పోయి ఆ చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. అయితే అక్టోబర్ 16 న బ్రూస్లీ విడుదల ఖాయం అని తెలుస్తూ ఉండగా అక్టోబర్ 22 న అఖిల్ వస్తే థియేటర్ లకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అనేది పంపిణీదారుల వాదన.

‘అఖిల్’ సినిమా దసరా కానుకగా పెద్ద ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను దాదాపుగా చివరిదశకు చేర్చిన సినిమా యూనిట్ అక్టోబర్ 22నే సినిమా విడుదల కానుందన్న విషయాన్ని స్పష్టం చేసేసింది.

కానీ బ్రూస్ లీ వలన విడుదల లేట్ అవ్వచ్చు అనేది మొన్నటి వరకూ వినిపించిన వార్త. నితిన్ , అఖిల్ మాత్రం సినిమా అక్టోబర్ 22 న చెప్పిన తేదీ లెక్కన విడుదల అయ్యి తీరాలి అని అనుకుంటూ ఉండగా నాగార్జున మాత్రం రిస్క్ చెయ్యద్దు అని సేఫ్ గా వెళ్ళమని కోరుతున్నాడు అనేది తెలుస్తోంది. 

ఏదేమైనా ఫైనల్ నిర్ణయం నితిన్ కే వదిలేసారు నాగార్జునా , అఖిల్ ఇద్దరూ. అక్కినేని వంశం నుంచి హీరో ఎంట్రీ అంటే ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు అందుకే రాబట్టుకోవాల్సిన మొత్తం ఎక్కువగా ఉండడం తో బ్రూస్ లీ హిట్ అయితే ఈ సినిమా మీద ఎఫెక్ట్ పడుతుందేమో అని చూస్తున్నారు అంతా. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -