Thursday, May 2, 2024
- Advertisement -

15మంది ప‌ని శ‌నివారం చెప్తా అంటున్న నాగార్జున‌

- Advertisement -

ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పుడు మూడవ సీజన్ మొదలైంది. బిగ్ బాస్ 3 కి టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సీజన్ మొదలై మూడు రోజులు గడిచాయి కానీ అప్పుడే కంటెస్టెంట్ ల మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. ఈసారి బిగ్ బాస్ లో కామనర్లను తీసుకోకుండా టీవీ, సోషల్ మీడియా లేదా వెండితెర సెలబ్రిటీలను మాత్రమే తీసుకున్నారు. వెండితెర నుంచి వరుణ్ సందేశ్, హేమ, వితిక, టీవీ ఇండస్ట్రీ నుంచి రవి కృష్ణ, అలీ రెజా, శివ జ్యోతి, శ్రీ ముఖి తదితరులు వచ్చారు.

సోషల్ మీడియా నుండి అషు, సింగర్ రాహుల్ తదితరులు కూడా బిగ్ బాస్ త్రీ లో పాల్గొంటున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి సభ్యులను ఎవరు ఎలా ఎంపిక చేశారు? సిఫార్సులు కూడా ఉన్నాయా అంటూ అని చాలామందిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే తాజాగా షోస్ నాగార్జున బిగ్ బాస్ సెలక్షన్ పై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. అసలు షో మొదలయ్యే 5నిమిషాల ముందు వరకు కనీసం తనకు కూడా ఆ 15మంది పేర్లు తెలియలేదు అంటూ నాగార్జున వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -