ఆగిపోయిందని అనుకున్న ప్రాజెక్టును పట్టుదలతో నందమూరి బాలకృష్ణ సెట్స్పైకి తీసుకొచ్చారు. తన తండ్రి, దివంగత నందమూరి తారక రామారావు జీవితంపై బయోపిక్గా సినిమా చేస్తున్నాడు. దర్శకుడు తేజ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా ‘ఎన్టీఆర్’ పాత్రలో ఎవరు నటిస్తున్నారో ఇంకా ఒక క్లారిటీ లేదు.
అయితే ఈ సినిమాను సెట్స్పైకి మార్చి 29వ తేదీన తీసుకెళ్తానని బాలకృష్ణ అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ సినిమా ప్రారంభ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, బంధువులందరినీ ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా నిమ్మకూరులో బంధువులు, కుటుంబసభ్యులను బాలకృష్ణ ఇటీవల పర్యటించి ఆహ్వానం పలికారు. వీరితో పాటు ఎన్టీఆర్ భార్య బసవతారకం స్వగ్రామం కొమరవోలు గ్రామంలో కూడా బాలకృష్ణ పర్యటించి కుటుంబసభ్యులు, బంధువులను సినిమా పూజా కార్యక్రమాలకు హాజరు కావాలని స్వయంగా ఆహ్వానం పలికారు.
ఈ సినిమా మార్చి 29వ తేదీన హైదరాబాద్లోని రామకృష్ణ స్టూడియోస్లో ప్రారంభించనున్నారు. అయితే ఈ సినిమాలో నటీనటుల వివరాలు ఏమి తెలియరాలేదు. ఈ సినిమాను బాలకృష్ణ నటించి స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండడంతో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.