బాలయ్యబాబు – నయనతార కాంబినేషన్లో కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీ ‘జైసింహా’. ప్రస్తుతం ఈ మూవీ వైజాగ్ సిటీలోని ఆర్కే బీచ్లో షూటింగ్ జరుపుకుంటుంది. బీచ్ ప్రాంతంలో తమ నాయకుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతూ అతడి అనుచరులు చేస్తున్న ఆందోళన ఒకవైపు… ఇంతలో రంగ ప్రవేశం చేసిన జైసింహా పాత్రదారి బాలకృష్ణ మరో వైపు. ఒక్కసారిగా హీరోగారు రౌడీల భరతం పట్టాడు.
ఈ యాక్షన్ పిక్స్ బయటకు వచ్చాయి. ఇవి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పోస్టర్లలో ఆ రౌడీ పేరు రవిశంకర్ రెడ్డి అని పేరు పెట్టారు. వైజాగ్ లో రౌడీగా రెడ్డి ఉండటమేంటి. అంటే ఇక్కడ కావాలనే చెప్పి పనిగట్టుకుని రెడ్లపై ఇలా నెగిటివ్ ప్రచారం చేయడం ఏమాత్రం మంచిదికాదు. ఇది బాలయ్యబాబు అండ్ కో కు తెలియంది కాదు.
ఈసినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ అని కొందరు.. పొలిటికల్ బ్యాక్డ్రాప్ మూవీ అని మరికొందరు అంటున్నారు గాని.. ఓ వర్గాన్ని ఇప్పుడున్న టైమ్లో ఎంతలా తొక్కితే అంత తమకు మంచిదని అధికార పార్టీ హీరోగారితో రెడ్లపై విష ప్రచారం చేస్తున్నారని సర్వత్రా వినిపిస్తుంది.