మనం సినిమా తర్వాత నుంచీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని ప్రముఖ వంశాల హీరోలు మల్టీస్టారర్స్ చేయడానికి ఉత్సాహం చూపించారు. అయితే కథలు సెట్ అవ్వక చాలా మంది ఆగిపోయారు. కానీ ఇప్పుడు మనం లాంటి మరో మల్టీస్టారర్ సినిమా ఒకే అయిందని తెలుస్తోంది. నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణలు ఈ సినిమాలో యాక్ట్ చేయనున్నారు. మరో క్యారెక్టర్లో సీనియర్ ఎన్టీఆర్ కూడా కనిపిస్తాడట.
ఈ సినిమా ఫ్యాంటసీ థ్రిల్లర్గా తెరకెక్కనుంది. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్తో భారీ బడ్జెట్లో తెరకెక్కించనున్నారు. మంచికి చెడుకి మధ్య పోరాటంగా ప్రస్తుతం…….ఫ్లాష్ బ్యాక్లో దేవతలు-రాక్షసుల పోరాటంగా మరో ఎపిసోడ్తో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. స్వర్గీయ ఎన్టీఆర్ని ఈ సినిమాలో దేవుడిగా చూపించనున్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే హరికృష్ణ కూడా ఒక ముఖ్యపాత్రలో కనిపంచనున్నాడని తెలుస్తోంది. పౌరాణిక సినిమాలు, ఫ్యాంటసీ సినిమాలు నందమూరి హీరోలకు చాలా బ్లాక్ బస్టర్స్నే అందించాయి. యమదొంగ సినిమాలో యంగ్ యముడిగా ఎన్టీఆర్ నభూతో అనే స్థాయిలో యాక్టింగ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మరి ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్లో ఇంకెన్ని మెరుపులు ఉంటాయో చూడాలి. ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్నాడు. ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి సినిమాలు తీసిన పవన్కి ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. గుణ్ణం గంగరాజు లాంటి సీనియర్ రైటర్స్ స్క్రీన్ ప్లే విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు.