మహేశ్ బాబు కథానాయకుడిగా .. ఆయన 25వ సినిమాగా ‘మహర్షి’ తెరకెక్కింది.. మహేష్ బాబుకు మహర్షి సినిమా మంచి బూస్ట్ ను ఇచ్చింది. భరత్ అనే నేను తరువాత వరసగా రెండో సినిమా మహర్షి కూడా హిట్ కొట్టడంతో ఆనందంలో ఉన్నాడు మహేష్. ఈ నెల 28న జరగబోయే మహర్షి అర్ధశతదినోత్సవ వేడుకలకు హైదరాబాద్ శిల్పకళావేదిక సిద్ధమవుతోంది. 200 కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకుంటోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో, కథానాయికగా పూజ హెగ్డే నటించింది. మే 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తూ, ఈ నెల 27వ తేదీతో 50 రోజులను పూర్తి చేసుకోనుంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం మహర్షికి చీఫ్ గెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని రాబోతున్నాడు. ఈ మేరకు దిల్ రాజు అతని నుంచి అంగీకారం తీసుకున్నాడట. నాని వస్తున్నాడు అంటే ఇంకాస్త జోష్ పెరుగుతుంది. తన మాటతీరుతో ప్రత్యేకంగా ఆకట్టుకునే నాని స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం ఖాయం. ఇటు మహేశ్ అభిమానులకు .. అటు నాని ఫ్యాన్స్ కి ఈ నెల 28వ తేదీ పండుగ రోజేనన్నమాట.