యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అరవింద సమేత. సినిమా మొదటి నుంచి ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో లీక్ అవుతునే ఉంది.తాజాగా ఈ సినిమా కథ గురించి ఓ న్యూస్ బయటికి వచ్చింది.సినిమా రాయలసీమకు సంబంధించిన కథగా మొదటి నుంచి చెబుతునే ఉన్నారు.ఎన్టీఆర్ ఈ సినిమాలో రాయలసీమ యాస మాట్లాడటమే కాదు .. ఫ్యాక్షన్ నేపథ్యంలో కనిపించనున్నాడు. ఫ్యాక్షన్ హత్యల నేపథ్యంలో ఇంతవరకూ చాలా సినిమాలు వచ్చాయి.
రాయల సీమలో ఫ్యాక్షన్ కారణంగా భర్తలను .. పిల్లలను .. అన్నదమ్ములను కోల్పోయిన స్త్రీల పరిస్థితులకి సంబంధించిన కోణంలో ఈ కథ కొనసాగుతుందట. వాళ్ల ఎమోషన్స్ చూసిన కథానాయకుడు ఎలా స్పందిస్తాడు? ఏం చేస్తాడు అనేది కథతో సినిమాను తెరకెక్కించారట.సినిమాలో మంచి ఎమోషన్ ఉండటంతో అరవింద సమేత హిట్ అవుతుందని ఎన్టీఆర్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు నటిస్తున్నారు.దసరాకు కానుకగా ఈ నెల 11న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.