వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న హీరో నితిన్ తన సినిమా జోష్ మాత్రం తగ్గించడం లేదు. రీసెంట్గా ఎక్స్ట్రార్డినరీ సినిమాతో వచ్చినా బాక్సాఫీస్ వద్ద అది ఆశీంచిన ఫలితాన్ని రాబట్టలేదు. ఇక తాజాగా రాబిన్ హుడ్గా రాబోతున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా సినిమా టైటిల్ గ్లింప్స్ని రిలీజ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా గ్లింప్స్ ఆధ్యంతం ఆకట్టుకుంది.
ఆస్తులున్నవాళ్లంతా నా అన్నదమ్ముళ్లు.. ఆభరణాలేసుకున్నవాళ్లంతా నా అక్క చెల్లెళ్లు అంటూ నితిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబరని చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు… అయినా నేను హర్ట్ అవ్వలేదు ఎందుకంటే అయినవాళ్ల దగ్గరకు తీసుకోవడం నా హక్కు అంటూ డైలాగ్లు బాగున్నాయి. ఇండియా ఈజ్ మై కంట్రీ.. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ సినిమా కథను చెప్పకనే చెప్పేశాడు.
రేపటి నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుండగా నితిన్కి జోడీగా శ్రీలీల నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగితా నటీనటుల వివరాలను వెల్లడించనుండగా రాబిన్ హుడ్తోనైనా నితిన్ హిట్ కొడతాడా లేదా వేచిచడాలి.