తన తండ్రి ఎన్టీఆర్ ఆత్మకథ ఆధారంగా తీస్తున్న సినిమా ‘ఎన్టీఆర్’. ఈ సినిమా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నటించాలని నిత్యమీనన్ను నటించాలని అడిగారంట. అయితే ఆ సినిమాలో తాను చేయనని ఖరాఖండిగా చెప్పేసిందంట. ఈ సినిమాలో ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో నటించాలని కోరారు. ఆ పాత్రకు నిత్యమేనన్ని అడగ్గా నిత్య ‘నో’ చెప్పిందని సమాచారం.
అయితే ఇంత పెద్ద సినిమాలో అంగీకరించకపోవడానికి కారణాలు ఏమిటో తెలియడం లేదు. నిత్య మీనన్ ఎప్పుడూ తనకు నచ్చిన సినిమాలనే చేస్తు ఉంటుంది. తనకు నచ్చిన సినిమాలు చిన్నవైనా పెద్దవైనా ఒప్పేసుకుంటుంది. నటన ప్రాధాన్యం.. తను నిర్దేశించుకున్న నిబంధనలలో ఉంటే ఆ సినిమా ఒప్పేసుకుంటుంది. దీంతో నిత్య ఈ సినిమాకు నో అని చెప్పిందని సమాచారం.
ప్రస్తుతం నిత్యమీనన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరో నాని నిర్మాణంలో రూపొందుతున్న అ! సినిమాలో నటిస్తోంది. సావిత్రి సినిమాలో కూడా నటిస్తోంది.