నటనతోపాటు డబ్బింగ్, గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యా మీనన్ ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకత్వం చేయనుందని సమాచారం. ఆమె నటించిన సినిమాలు క్లాసిక్ హిట్గా నిలుస్తాయి. నిత్య పాత్ర ఎంపికనే భిన్నంగా ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకునేలా.. తన నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటుంది. అందుకే ఆమె టాలీవుడ్కు వచ్చి ఏళ్లవుతున్నా సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్లందరూ పోలోమని సినిమాలు చేస్తున్నా నిత్య మీనన్ మాత్రం తనకు నచ్చిన పాత్రను చేస్తూ వెళ్తోంది. నితిన్తో చేసిన `ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే` సినిమాలు బాగా ఆడాయి. ఆ తర్వాత ఎన్టీఆర్తో కలిసి జనతా గ్యారేజ్లో కనిపించిన నిత్య మళ్లీ ఆ తర్వాత కనిపించలేదు.
అయితే ఇటీవల ఓ పెద్ద సినిమాకు అవకాశం వచ్చినా చేయనని చెప్పేసింది. తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తీస్తున్న సినిమాలో బసవతారకం పాత్రకు నిత్య చేయనని తెగేసి చెప్పేసింది. రామారావు సతీమణి బసవతారకం పాత్రలో యాక్టింగ్ చేయడానికి ఆమెకు ఆఫర్ వచ్చిందట. ఇటీవల అ! సినిమాలో ఒక పాత్రలో నటించిన ఆమె ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పలు విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ సినిమా ఎందుకు వద్దన్ననో సినిమా బృందానికి చెప్పారని తెలిపారు. ఈ విషయం చెబుతూనే ఒక ఆసక్తికరమైన వార్త చెప్పారు.
తాను మెగాఫోన్ పట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలిపారు. దర్శకత్వం చేయడానికి ఓ ఆసక్తికరమైన స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నానని చెప్పారు. దర్శకురాలిగా మారి మంచి సినిమా చేస్తానని చెప్పుకొస్తున్నారు. మరీ నటించిన మాదిరిగానే ఆమె తీస్తే సినిమా బాగుంటుందేమో చూడాలి.