Sunday, May 19, 2024
- Advertisement -

తెలుగు ద‌ర్శ‌కుల సంఘం అధ్య‌క్షునిగా ఎన్.శంక‌ర్

- Advertisement -

ఆదివారం జరిగిన తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఎన్నికల్లో ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి సానా యాదిరెడ్డిపై 310 ఓట్ల మెజారిటీతో ఎన్‌.శంకర్‌ గెలుపొందారు.కార్యవర్గ సభ్యులుగా శ్రీకాంత్‌ అడ్డాల, అనిల్‌ రావిపుడి, ప్రియదర్శిని, గంగాధర్, అంజిబాబు, మధుసూదన్‌ రెడ్డి, కృష్ణ మోహన్, కృష్ణ బాబు, చంద్రకాంత్‌ రెడ్డి విజయం సాధించారు.

ఆయన ప్యానల్‌ సభ్యులు ప్రధాన కార్యదర్శిగా జి. రాం ప్రసాద్, కోశాధికారిగా కాశీ విశ్వనాద్, ఉపాధ్యక్షులుగా ఏ.యస్‌.రవి కుమార్‌ చౌదరి, ఎస్‌.వి.భాస్కర్‌ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా కట్టా రంగారావు, ఎమ్‌.ఎస్‌.శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా డీవీ రాజు(కళింగ), ఎన్‌ గోపీచంద్‌ ఎన్నికయ్యారు. ఈ కార్య‌వ‌ర్గం రెండు సంవ‌త్స‌రాలపాటు ప‌ద‌వి కాలంలో ఉంటుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -