నటుడు హరికృష్ణ మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి.ఓ అభిమాని ఇంట్లో పెళ్లి నిమిత్తం బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి నెల్లురు బయలుదేరిన హరికృష్ణ.అతివేగంతో వెళ్తున్న హరికృష్ణ కారు నల్గొండ జిల్లా ,అనేపర్తి దగ్గర బొల్తా కొట్టడంతో ఆయన మరణించారు.తండ్రి మరణవార్త తెలియగానే ఎన్టీఆర్ అక్కడిక్కడే కుప్పకులిపోయాడు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎంత చెప్పిన వినిపించుకోలేదని తెలుస్తుంది.ఎన్టీఆర్ పెద్దన్నయ్య జానకిరామ్ 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిని సంగతి తెలిసిందే.అప్పటి నుంచి నందమూరి వారసుల చిత్రాలు ప్రారంభం కావడానికి ముందుగా థియేటర్లలో.
”అతివేగం ప్రమాదకరం.. యాక్సిడెంట్ కారణంగా మేము ఇప్పటికే మా ప్రియ సోదరుడిని కోల్పోయాం. ఆ పరిస్థితి మరెవరికీ రావొద్దు” అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లినా.. అభిమానులను ఉద్దేశిస్తూ మా ఇంట్లో జరిగిన విషాదం మరే ఇంట్లో జరగకూడదు.. జాగ్రత్తగా మీరందరూ ఇంటికి వెళ్లండి అంటూ జాగ్రత్తలు చెప్పేవారు. ఎన్టీఆర్ హెచ్చరించి, జాగ్రత్తలు చెబుతున్నా హరికృష్ణ మాత్రం డ్రైవింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కారు నడిపి ప్రమాదానికి గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా వరుసగా కుటుంబంలో యాక్సిడెంట్లు జరగడం కుటుంబాన్ని కుంగదీస్తోంది.