- Advertisement -
ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవిత కథను ఎన్టీఆర్ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రను ఆయన తనయుడు హీరో బాలకృష్ణ పోషిస్తు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ రోజే (శుక్రవారం) హైదరబాద్లో జరగనుంది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ జెఆర్సీ కన్వెన్షన్ హాల్ లో అట్టహాసంగా జరగనుంది.
ఈ వేడుకకు నందమూరి కుటుంబం మొత్తం తరలి రానుంది. జూనియర్ ఎన్టీఆర్ కి బాలయ్య ఫోన్ చేసి మరీ ప్రత్యేకంగా పిలిచినట్లు సమాచారం. ఈ ఫంక్షన్కు తన తండ్రి కాలం నాటి హీరోలను బాలయ్య ఆహ్వానించినట్లు తెలుస్తుంది. సీనియర్ నటులు సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణం రాజు, మోహన్ బాబులతో పాటు ఒకప్పటి తారలు జమున, కైకాల సత్యనారాయణ, గీతాంజలి ఈ వేడుకలో పాల్గొనున్నారు.