తెలుగు లో మొదటి సారిగా బిగ్ బాస్ తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్. బిగ్ బాస్ సీజన్ వన్ కి బుల్లితెరపై ఎంతో రెస్పాన్స్ లభించింది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హూస్ట్ గా వ్యవహరించారు. ఇక 3,4 సీజన్లకు కింగ్ నాగార్జున్ హూస్ట్ గా వ్యవహరించారు. ఇక మీలో ఎవరు కోటీశ్వరుడు కి కింగ్ నాగార్జున, చిరంజీవిలు హూస్ట్ గా వ్యవహరించారు.
చాలా కాలం తర్వాత మరోసారి బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఎన్టీఆర్. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు ఎన్టీఆర్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.
తాజాగా ‘ఆట నాది, రూ.కోటి మీది’ అని అంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బుల్లితెరపై ఈ షో త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మరో ప్రోమోను విడుదల చేశారు. జీవితాన్ని మారుద్దాం రామ్మా అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న డైలాగులు అలరిస్తున్నాయి.
అందుకే నిరుద్యోగం పెరుగుతుంది: రాహుల్ గాంధీ