Monday, May 13, 2024
- Advertisement -

‘జనతా గ్యారేజ్’ టీజర్ అదిరింది!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ చిత్రంపై అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల తర్వాత వస్తున్న చిత్రం కావడం వల్ల అంచనాలు బానే ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ రిలీజ్ అయ్యిన్నప్పటి నుంచి అభిమానులు ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో మంచి హిట్స్ కొట్టిన కొరటాల శివ ఈ ‘జనతా గ్యారేజ్’ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు అభిమానులకు ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ టీజర్ రూపంలో ట్రీట్ ఇచ్చాడు. ఈ రోజే ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేసారు. ఇప్పటికే షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న జనతా గ్యారేజ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయారు. మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

{youtube}v=q6voJ13asIo{/youtube}

ఇక ఈ టీజర్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేలా ఉంది. ఇక ఈ టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన “బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయితి బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలముంది జనతా గ్యారేజ్!! ఇచట ఆన్నీ రిపైర్లు చేయబడును” అనే డైలాగ్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్ బాగుంది. 

Related

  1. జనతా గ్యారేజ్ గురించి గుడ్ న్యూస్!
  2. జనతా గ్యారేజ్ లో సమంత రెచ్చిపోయి నటిస్తోందట..
  3. సింహాద్రి రేంజ్ లో జనతా గ్యారేజ్!
  4. ‘జనతా గ్యారేజ్‌’ ఫస్టు లుక్! సంచలనం సృష్టిస్తుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -